భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్ విజయవాడ
పాతూరి నాగభూషణం.. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ ఛార్జి
ఎపీలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ప్రజల స్పందన అర్దమవుతుంది
ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలి వచ్చారు
ఓటు హక్కు తమ బాధ్యత అని ప్రజలు భావించి ఉదయం నుంచే బారులు తీరారు
ఐప్యాక్ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ వస్తాయని జగన్ చెప్పుకుంటున్నారు
దీనినే దింపుడు కళ్లెం ఆశ అంటారనేది వాళ్లు తెలుసుకోవాలి
ఇప్పటికే ఐప్యాక్ టీం ప్యాకప్ అయిపోయి వెళ్లిపోయారు
పేపర్లో వార్తలు వచ్చాక తప్పదనే ఈ రోజు జగన్ సమావేశం పెట్టారు
గత ఎన్నికలలో ఇచ్చిన సందేశానికి, ఇప్పుడు జగన్ ఇచ్చిన సందేశానికి పోలికే లేదు
ఇప్పుడు ప్రజల దయ ఎలాకూ లేదు కాబట్టి.. దేవుడి దయ అని మేకపోతు గాంభీర్యం పోతున్నారు
ప్రజలు బ్యాలెట్ బాక్సులలో తమ నిర్ణయం సిద్దం చేశారు.. వైసీపీ ఓటమి ఖాయం
ఇసుక తవ్వకాలు ఎపీలో యధేచ్చగా జరుగుతుంది
దీనిపై కలెక్టర్లు అసత్యాలతో నివేదికలు ఇచ్చారు
ఇసుక మాఫియాను కంట్రోల్ చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు వంత పాడుతున్నారు
సీయస్ జవహర్ రెడ్డి కూడా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు
పెన్షన్ల విషయంలోనే సీయస్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చింది
కూటమి పార్టీల నేతలు కోర్టు, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది
64లక్షల పెన్షన్ దారులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వచ్చని లెక్కలు వేసి చెప్పాం
ఆమాత్రం కూడా తెలియకుండా జవహర్ రెడ్డి సీయస్ గా ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా
ఆళ్లగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు కూడా వైసీపీ ఓటమి ని తెలియ చేస్తున్నాయి
పోలీసులు ముందు చూపుతో వ్యవహరించక పోవడం వల్లే ఈ దాడులు జరిగినట్లు అర్దం అవుతుంది
వివిధ పధకాల కింద నిధులు పోలింగ్ కు ముందు ఇస్తానని జగన్ హడావుడి చేశారు
ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ 14వేల కోట్లు ఎక్కడకి వెళ్లాయో సీయస్ సమాధానం చెప్పాలి
వివిధ ఆరోపణల్లో ఉన్న అధికారులను తప్పించాలని మేము కోరితే.. వారిని ప్రాధాన్యత పోస్టుల్లో వేశారు
కేంద్రంలో 400సీట్లు , ఎపీలో యన్డీఎ కూటమి 160 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం
మరో ఇరవై రోజుల్లో ఎపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది
రాష్ట్రంలో ప్రజలకు మంచి , మేలు జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ది చెందుతుంది
సీయస్ గా ఉన్నజవహర్ రెడ్డి ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలని కోరుతున్నాం
ఇప్పటికీ కొంతమంది అధికారులు వైసీపీకి వత్తాలు పలుకుతున్నారు.. మానుకుంటే మంచిది
అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తున్నాం
స్ట్రాంగ్ రూమ్ కు సమీపంలో పార్టీలు పెడితే.. ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలి
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించిన ఎన్నికలసంఘానికి మా తరపున ధన్యవాదాలు
ఎన్నికల సంఘానికి కూటమి పార్టీల తరపునే లేఖలు రాసి వాస్తవ పరిస్థితి వివరించాం
పురంధేశ్వరి గారు రాసినా, ఇతర పార్టీలు రాసినా.. కూటమి కిందే లెక్కగా పరిగణించాలి
చిలకలూరి పేటలో ప్రధాని మోడీ సభ లో భద్రతా వైఫల్యం నిజం కాదా
వాటిని వివరిస్తూ మా అధ్యక్షురాలు లేఖలు రాస్తే తప్పేముంది
విజయవాడలో నిర్వహించిన ర్యాలీ లో భద్రత కట్టుదిట్టం చేశారు కదా
ఎన్నికల అబ్జర్వర్స్ వారి పని వారు చేస్తూ.. నివేదికలు ఇస్తారు
వైసీపీ నేతలకు ఓటమి ఖాయంగా తేలిపోయింది.. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు
ఎపీలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పేర్ని నాని, అంబటి రాంబాబు ఇప్పుడు అంటున్నారు
మరి ఇదే నాని .. గతంలో ఎస్పీ ఎవడు.. నాకన్నా తక్కువ అంటూ రంకెలు వేయలేదా
అంబటి రాంబాబు, అనిల్ కుమార్, అప్పిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోలేదా
పోలింగ్ అనంతరం పోలీసులు, టీడీపీ నేతల పై దాడి చేసి తలలు పగులకొట్టింది వైసీపీ నేతలు కాదా
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి భారీగా జరిగింది.. దీనిపై విచారణ ఉంటుంది
యన్డీఎ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులపై చర్యలు కూడా తీసుకుంటారు
అభివృద్ది, సంక్షేమం నమ్మి ప్రజలు కూటమికే ఓట్లు వేశారు.. అందుకు కృతజ్ఞతలు