ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు చేయనున్నారు. ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం రామోజీరావు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే