జడ్జిలు తమ ఆస్తులు బహిరంగంగా వెల్లడించాలి
సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల ఆస్తులకు సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక చర్యలు చేపట్టింది. జడ్జీలు తమ ఆస్తులను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వివాదం నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.